వాయనాడ్ బాధితులకు నయన్, విఘ్నేష్ భారీ విరాళం

కేరళలోని వాయనాడ్ కొండచరియలు విరిగిపడి సమస్తం కోల్పోయిన బాధితులకు నయనతార ఆమె భర్త విఘ్నేష్ అండగా నిలిచారు.;

Update: 2024-08-03 06:48 GMT

కేరళలోని వాయనాడు కొండచరియలు విరిగిపడి సమస్తం కోల్పోయిన బాధితులకు నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తమ మద్దతును ప్రకటించారు. బాధితులకు ఆర్థిక సహాయం అందజేస్తూ ఈ జంట కేరళలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి హృదయపూర్వక లేఖను పంపారు. వారు తమ సంఘీభావ సందేశాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. 

లేఖ సారాంశం "వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాదకర నేపథ్యంలో, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సంకల్పించాము. ప్రకృతి సృష్టించిన విధ్వంసం మమ్మల్ని తీవ్రంగా కదిలించింది. ఇలాంటి విపత్కర సమయాల్లో ఒకరికొకరు అండగా ఉండడం చాలా అవసరం. బాధితులను ఆదుకోవడానికి అందరూ కలిసి రావాలి. సంఘీభావం ప్రకటించాలి. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించడానికి మేము ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 20,00,000 (ఇరవై లక్షలు) అందిస్తున్నాము అని పేర్కొన్నారు.

నయనతార, విఘ్నేష్‌తో పాటు పలువురు ఇతర నటీనటులు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమిళ స్టార్లు సూర్య మరియు విక్రమ్‌లతో పాటు మలయాళ నటులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా మరియు ఆసిఫ్ అలీ అందరూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు.. 

Tags:    

Similar News