లేడీ సింగం నయనతార అమ్మవారి పాత్రలో కనిపించనుంది. 2020లో వచ్చిన మూకూతి అమ్మన్ -2 చిత్రానికి సీక్వెల్గా వస్తున్న సినిమాలో నయన్ అమ్మవారి పాత్రలో మెప్పించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం త్రిష కృష్ణన్, శృతి హాసన్ పేర్లను పరిశీలిస్తున్నట్టు వదంతులు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాతలు ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ముకూతి అమ్మన్ సినిమాలో ఆర్ జే బాలాజీ, నయనతార, మౌలి, ఊర్వశి, స్మృతి వెంకట్ తదితరులున్నారు. మళ్లీ వాళ్లే నటిస్తారా..? లేదా..? అనేదానిపై క్లారిటీ రాలేదు కానీ.. నయన్ విషయాన్ని మాత్రం రివిల్ చేశారు. నయనతార నటించిన చిత్రం అన్నపూర్ణి, 2023లో విడుదలైన విషయం తెలిసిందే. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలను ఎదుర్కొంది. దీనిపై నయన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం, ఆమె మన్నంగట్టి సిన్స్, మరియు టెస్ట్ అనే రెండు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. నయనతార తన సినీ కెరీర్తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ట్రెండీ డ్రెస్లో అబ్బురపర్చింది నయన్. 'ఆత్మవిశ్వాసం మహిళల ఉత్తమమైన ఆయుధం' అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ ట్యాగ్ లైను నెటిజన్ల నుంచి నయన్ ప్రశంసలు అందుకుంది.