పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘హరిహర వీరమల్లు’. చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తోన్న ఈ మూవీ ఫైనల్ గా పూర్తయింది. మొదట్లో కొన్ని షెడ్యూల్స్ ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. తర్వాత ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగతా భాగం పూర్తి చేశాడు. జూన్ 12న విడుదల కాబోతోన్న ఈ మూవీ ఔరంగజేబ్ కాలం నాటి కథతో రూపొందింది. ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన ఓ యువకుడు నాటి మొఘల్స్ ను ఎలా ఎదురించాడు అనే కోణంలో కథనం సాగుతుందట. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు అని ముందు నుంచీ చెబుతున్నారు. ఔరంగ జేబ్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్, ఇతర పాత్రల్లో నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, విక్రమ్ జీత్ విర్క్, పూజిత పొన్నాడ, అనసూయ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీపై ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి.
ఇక జూన్ 12 దగ్గరకు వస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ మూవీ డబ్బింగ్ ను పూర్తి చేశాడు. మరోవైపు ఓ.జి మూవీ షూటింగ్ లో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ డబ్బింగ్ చివరి వరకూ ఆగితే హడావిడీ అవుతుందని భావించి ముందుగానే ఫినిష్ చేశాడు. ఏదేమైనా పెండింగ్ మూవీస్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నాడు పవన్. అందుకే వచ్చే నెల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ను కూడా తిరిగి మొదలుపెట్టబోతున్నారు. సో.. ఈ మూడు సినిమాల తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కు అంకితం అవుతాడా లేక.. ఇలా అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తాడా అనేది తర్వాత తెలుస్తుంది.