Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా పూరీ...!

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ సర్కారు వారి పాట..

Update: 2022-05-04 10:27 GMT

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ సర్కారు వారి పాట.. మే12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగానే చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 7న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ ఈవెంట్‌కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. సర్కారు వారి పాట దర్శకుడైన పరశురామ్ పెట్లకి పూరీ జగన్నాధ్‌ స్వయంగా బంధువు.. పరుశురాం దర్శకుడు కాకముందు పూరీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. ఇక సర్కారు వారి పాటలో మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. భారీ బడ్జెట్ యాక్షన్, రొమాంటిక్ మరియు కామెడీ డ్రామాగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. 

Tags:    

Similar News