కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడైన తర్వాత కాంచన సీరీస్ తో సూపర్ సక్సెస్ అయ్యాడు లారెన్స్. తన డైరెక్షన్ లోనే కాక బయట దర్శకుల సినిమాల్లోనూ ముందు నుంచే హీరోగా నటిస్తున్నాడు. అయితే తన డైరెక్షన్ లో రూపొందే సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. విశేషం ఏంటంటే.. ఏదో రకంగా వారిని కథల్లో భాగంగా మారుస్తుంటాడు. ప్రస్తుతం అతను లోకేష్ కనకరాజ్ అందించిన కథతో ‘బెంజ్’అనే సినిమా చేస్తున్నాడు. భాగ్యరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకుడు. లోకేష్ సమర్పకుడిగా కూడా ఉన్నాడు. మళయాల హీరో నివిన్ పాలీ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లను తీసుకుున్నట్టు ప్రకటించింది టీమ్. ఈ ముగ్గురూ క్రేజీ హీరోయిన్లే కావడం మరో విశేషం.
వీరిలో చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతున్న సంయుక్త తో పాటు, ప్రియాంక మోహన్, మడోన్నా సెబాస్టియన్ ఉన్నారు. ఈ ముగ్గురికీ సౌత్ లోని అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. ఆ కారణంగా మూవీకి కూడా ప్లస్ అవుతారు. ఇక లారెన్స్ ఎలాగూ అందరికీ తెలుసు. సో.. ఈ ముగ్గురు అతనికి ప్యాన్ ఇండియా రేంజ్ కాకపోయినా ప్యాన్ సౌత్ కు పెద్ద ఎసెట్ అవుతారు. ఇక ఈ చిత్రంలోని మడోన్నా సెబాస్టియన్ లోకేష్ సినీ వర్స్ లో భాగంగానే కనిపిస్తుందనే టాక్ ఉంది. అంటే తను లోకేష్ రూపొందించే ఇంకేదైనా సినిమాలో ఈ సినిమా పాత్రతో కనిపిస్తుందేమో అనుకోవచ్చు. మొత్తంగా ఈ ముగ్గురూ లారెన్స్ కే జోడీగా ఉంటారా లేక నివిన్ పాలీకీ జోడీ ఉంటుందా అనేది చూడాలి.