Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటని మహేష్ బాబు కాదంటే.. : డైరెక్టర్ పరశురామ్

Sarkaru Vaari Paata: మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Update: 2022-05-03 11:30 GMT

Sarkaru Vaari Paata: మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున, మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ 'గీత గోవిందం' రోజుల్లోనే 'సర్కారు వారి పాట (ఎస్‌విపి)' కథను రాసుకున్నానని, అయితే సూపర్‌స్టార్‌ మహేష్ బాబును సంప్రదించడానికి సంకోచించానని వెల్లడించారు. ఆయన కాదంటే ఈ కథను పక్కన పెట్టేద్దామనుకున్నాను.. మరెవ్వరూ ఆ పాత్రకు సరిపోరు.. ఆయన అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని బలంగా నమ్మాను.. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మహేష్ సూపర్ గా నటించాడు ఈ చిత్రంలో అని చెప్పారు పరశురామ్.

"మహేష్ బాబు నాకు కథ చెప్పే అవకాశం ఇచ్చి సింపుల్ గా ఓకే చేసాడు. అతను పాత్రలతో కనెక్ట్ అయ్యాడు. "మహేష్‌కి స్క్రిప్ట్‌పై గట్టి పట్టు లభించిన తర్వాత, అతడు ఆ కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాడు అని పరశురామ్ తెలిపారు.

"మీరు నా కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే 'సారొచ్చారు' విఫలమైన తర్వాత, కొన్ని సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్నాను. ఆపై మళ్లీ చిత్రాలు తీయడం ప్రారంభించాను అని పరశురామ్ అన్నారు.

భారీ అంచనాలున్న చిత్రాల్లో ఎస్‌విపి ఒకటి అయినప్పటికీ, 'సర్కారు వారి పాట' అంచనాలను అందుకుంటుందని దర్శకుడు పరశురామ్ నమ్మకంగా ఉన్నారు. "SVPకి బ్యాంక్ బ్యాక్‌డ్రాప్ ఉంది, కానీ కథలో కుంభకోణాలు వంటివి ఏమీ లేవు. కానీ కథనంలో అనేక భావోద్వేగాల పొరలు ఇమిడి ఉన్నాయి" అని తెలిపారు.

'SVP' కోసం మహేష్ మేకోవర్‌ పై మరింత శ్రద్ధ కనబరచాలనుకున్నాను. దానికి అతడు కూడా వెంటనే అంగీకరించాడు. సినిమా కోసం తన జుట్టును పెంచడం, ఇతర చిన్న చిన్న మార్పుల వంటివి చాలా చేశామని చెప్పుకొచ్చారు.

"మహేష్ బాబుకు పని పట్ల శ్రద్ధ చాలా ఉంది. అతడు ఎందుకు సూపర్ స్టార్ అయ్యాడో అతడితో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకు నేర్పింది'' అని దర్శకుడు వివరించారు.

Tags:    

Similar News