P Chandrasekhara Reddy: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

P Chandrasekhara Reddy: టాలీవుడ్ ఇప్పటికీ ఎంతోమంది ప్రముఖ వ్యక్తులను, టాలెంటెడ్ పర్సనాలిటీలను కోల్పోయింది.

Update: 2022-01-03 05:19 GMT

P Chandrasekhara Reddy: టాలీవుడ్ ఇప్పటికీ ఎంతోమంది ప్రముఖ వ్యక్తులను, టాలెంటెడ్ పర్సనాలిటీలను కోల్పోయింది. తాజాగా మరో దర్శకుడు కూడా కన్నుమూశారు. ఆయనే పి చంద్రశేఖర్ రెడ్డి. 80కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఎన్‌టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి సీనియర్ హీరోలతో చంద్రశేఖర్ రెడ్డి సినిమాలను తెరకెక్కించారు. మానవుడు-దానవుడు, బంగారు కాపురం, పాడిపంటలు, బడిపంతులు వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి.

Tags:    

Similar News