సప్తసాగర దాచె ఎల్లో.. ఇదేంటీ అనిపిస్తోంది కదా.. లాస్ట్ ఇయర్ శాండల్ వుడ్ లో సెన్సేషనల్ విజయం సాధించిన సినిమా. అక్కడ హిట్ అయిన తర్వాతే తెలుగులో సప్త సాగరాలు దాటి అంటూ విడుదల చేశారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీలో ప్రతి ఒక్కరినీ ఫిదా చేసిన బ్యూటీ రుక్మిణీ వసంత్. ఆమె అందరానికి సౌత్ మొత్తం పడిపోయింది. అంతకు మించిన సహజమైన నటన సైతం మెప్పించింది. అందుకే అన్ని భాషల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తాయి. కన్నడ నుంచి మరో స్టార్ హీరోయిన్ రెడీ అవుతుందని భావించారంతా. అయితే విశేషం ఏంటంటే.. రుక్మిణిని రక్షిత్ శెట్టికంటే ముందే తీసుకున్న దర్శకుడు మన సుధీర్ వర్మ. నిఖిల్ హీరోగా 'అపుడో ఇపుడో ఎపుడో' అనే సినిమాలో తనను హీరోయిన్ గా తీసుకున్నాడు. కాకపోతే ఈ మూవీ అనుకున్న దానికంటే బాగా లేట్ అయింది. ఈ లోగా తనకు సప్త సాగరాలు దాటి సినిమాతో బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ తో వచ్చిన క్రేజ్ వల్ల తెలుగులోనూ కొన్ని ఆఫర్స్ అందుకుంది. బట్ సడెన్ గా ఈ పాత సినిమా విడుదలకు సిద్ధమైంది.
'అపుడో ఇపుడో ఎపుడో' చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయబోతున్నారు. బట్ ఈ మూవీపై నిఖిల్ ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రమోషన్స్ కూడా చేయడం కష్టమే అంటున్నారు. గతంలో కూడా నిఖిల్ ఇలాగే ఓ సినిమాకు చేశాడు. ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మతో నిఖిల్ కు బెస్ట్ ఫ్రెండ్ బాండింగ్ ఉంది. కానీ ఇప్పుడతను ప్యాన్ ఇండియా హీరోను అని ఫీలవుతున్నాడు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకే 'అపుడో ఇపుడో ఎపుడో'ను పట్టించుకోవడం లేదు అంటున్నారు. మరి తనకు క్రేజ్ లేనప్పుడు కమిట్ అయిన సినిమా కాబట్టి రుక్మిణి కూడా ప్రమోషన్స్ కు వస్తుందనుకోలేం.
నిజానికి రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ తో పాటు పాటకు మంచి స్పందన వచ్చింది. నిఖిల్ ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా రుక్మిణి క్రేజ్ కూడా కలిసొచ్చి.. మాగ్జిమం ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి నిఖిల్ వస్తాడా.. అతనితో పాటు రుక్మిణి కూడా ప్రమోషన్స్ కు వస్తే 'అపుడో ఇపుడో ఎపుడో' ఆడియన్స్ కు మరింత ఎక్కువగా రీచ్ అవుతుంది. ఏదేమైనా సెన్సేషనల్ బ్యూటీగా మారిన రుక్మిణి ఫస్ట్ తెలుగు మూవీ ఇంత చప్పగా విడుదల కాబోతుండటం మాత్రం ఆశ్చర్యం అంటున్నారు చాలామంది.