Taapsee Pannu : పెళ్లి కోసం లెహంగా బదులు అనార్కలీ సూట్ ను ఎంచుకున్న నటి
43 ఏళ్ల మథియాస్ బో జూలై 11, 1980న జన్మించాడు. అతను డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను 1988లో అంతర్జాతీయ స్థాయిలో ఆడటం ప్రారంభించాడు. మార్చిలో వివాహం చేసుకునే ముందు ఈ జంట పదేళ్ల పాటు డేటింగ్ చేశారు.;
తాప్సీ పన్ను మథియాస్ బోయ్ని మార్చి 23, 2024న వివాహం చేసుకుంది. అయితే, వారు తన వివాహాన్ని ప్రైవేట్గా ఉంచాలని ఎంచుకున్నారు. ఈ ఈవెంట్ నుండి ఒక్క చిత్రాన్ని కూడా షేర్ చేయలేదు. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాప్సీ పన్ను తన వరుడు మథియాస్ బోయ్కి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఈ వీడియోలో ఆమె ఎరుపు రంగు అనార్కలీ సల్వార్ సూట్లో కనిపించింది.
తాప్సీ పెళ్లి వీడియో వైరల్
బుధవారం తాప్సీ పన్ను పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె తన పెళ్లి కోసం లెహంగా కాకుండా ఎరుపు రంగు అనార్కలీ సూట్ను ఎంచుకుంది. మరోవైపు, వరుడు మథియాస్ కాసేపు షేర్వాణీ ధరించి కనిపించాడు. ఆమె పెళ్లి ఎంట్రీ సందర్భంగా పంజాబీ పాట తేరే నాల్ నయియోన్ బోల్నాకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
First glimpse of #taapseepannu #mathiasboe #wedding #bollywood #fyp #bollywoodpollywoodlifez pic.twitter.com/FHfShGa3xa
— Kuldeep Kaur (@bollypollylifez) April 3, 2024
తాప్సీ పన్ను భర్త మథియాస్ బోయ్ ఎవరు?
43 ఏళ్ల మథియాస్ బో జూలై 11, 1980న జన్మించాడు. అతను డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను 1988లో అంతర్జాతీయ స్థాయిలో ఆడటం ప్రారంభించాడు. 2012 ఒలింపిక్స్లో పురుషుల డబుల్స్లో రజత పతకాన్ని సాధించాడు. 2015లో యూరోపియన్ గేమ్స్లో బంగారు పతకం సాధించాడు. చైనాలోని కున్షాన్లో జరిగిన 2016 థామస్ కప్లో డెన్మార్క్ విజేత జట్టులో కూడా అతను సభ్యుడు. ఇప్పుడు అతను భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రధాన డబుల్స్ కోచ్.
2014లో, అతను ఇండియా ఓపెన్లో ఆడుతున్నప్పుడు తాప్సీ పన్ను, మథియాస్ బో డేటింగ్ పుకార్లు తీవ్రమయ్యాయి. తాప్సీ పన్ను తరచుగా అతనిని ఉత్సాహపరుస్తూ కనిపించింది. ఇద్దరూ కలిసి ఒకరికొకరు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సాధించిన విజయాలను సంబరాలు చేసుకోవడం ప్రారంభించి, దానికి తోడు ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభించినప్పుడు దీనికి ఆమోద ముద్ర పడింది. ఇటీవల, తాప్సీ పన్ను రాజ్ షమణితో పోడ్కాస్ట్లో మథియాస్తో తన పదేళ్ల సంబంధం గురించి మాట్లాడింది. ఇకపోతే తాప్సీ చివరిసారిగా రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డుంకీలో షారూఖ్ సరసన నటించింది. ఆమె తదుపరి ఫిర్ అయి హసీన్ దిల్రూబాలో విక్రాంత్ మాస్సే సరసన నటిస్తుంది.