తెలుగు ఇండస్ట్రీలోకి మరో వారసురాలు..హీరోయిన్గా స్టార్ హీరో కూతురు..?
Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది వారసులు ఉన్నారు.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది వారసులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో 80 శాతం వారసులే కొనసాగుతున్నారు. అయితే ఎక్కువ మంది మగవారే రాణిస్తున్నారు. హీరోలు, హీరోయిన్ల వారసులు కొద్దీ మంది మాత్రలమే ఉన్నారు. వారిలో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి, మంజుల ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ జాబితాలోకి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూతురు మేధ కూడా చేరబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
మరోవైపు శ్రీకాంత్ కొడుకు రోషన్ 'నిర్మల కాన్వెంట్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్, కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో 'పెళ్లి సందD'అనే సినిమా చేస్తున్నాడు. ఇక కూతురు 17 ఏళ్ల మేధ హీరోయిన్గా వెండితెరపై మెరువబోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె మంచి డాన్సర్. ప్రస్తుతం ఆమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటుందంట. ఇక శ్రీకాంత్ తన కూతురు ఎంట్రీ గ్రాండ్గా చూస్తున్నారంట. స్వయంగా కథలను సెలక్ట్ చేసే పనిలో బీజీగా ఉన్నారంట. శ్రీకాంత్ సతీమణీ నటి ఊహ కూడా కొన్ని కథలు కూడా విన్నారని తెలుస్తోంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్ వారసురాలిని మనం సిల్వర్ స్క్రీన్పై చూడొచ్చు.