ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధికి కొత్త విధానాలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి, తెలుగు నిర్మాతల మండలి ఏపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లెటర్ విడుదల చేసింది.
ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి, ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అందించారు. వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోల నిర్మాణం/ మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి అడిగారు. నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు గృహనిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలను సమర్పించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహకారం మరియు మద్దతును అందించామని గుర్తు చేశారు. అలాగే నంది అవార్డులను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న అవార్డులనుకూడా ఇవ్వాలని మేము అభ్యర్థించారు.