Kubera Ticket Price hike : కుబేర టికెట్ ధరలు పెంచుకోవచ్చు..

Update: 2025-06-19 08:18 GMT

ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా మెయిన్ లీడ్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ స్టార్ హీరోలతో సినిమా చేయడమే టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉంటే.. ఆ ఇద్దరు స్టార్స్ పూర్తిగా శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ కు సరెండర్ అయిపోయారు అనిపించేలా ఉన్న ట్రైలర్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్ గా ఉండబోతోందనిపించేలా ఆల్రెడీ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఓ కొత్త కథ చెప్పబోతున్నాడు శేఖర్ అని ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు.

కుబేర చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈమేరకు సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీ ప్లెక్సెస్ లో కూడా పది రోజులు పాటు ఒక్కో టికెట్ పై 75 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చు అని అనుమతులు జారీ చేసింది. వీటికి జీఎస్టీ అదనం. సో.. సింగిల్ స్క్రీన్స్ లో దాదాపు 230 రూపాయల వరకూ, మల్టీ ప్లెక్సెస్ లో 300 రూపాయలకు పైగా టికెట్ ధరలు ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచబోం అని ఆ మధ్య చెప్పింది. దీంతో ప్రభుత్వాన్ని సినిమా వాళ్లెవరైనా అసలు అప్రోచ్ అయ్యారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్య జరిగిన గద్దర్ అవార్డ్స్ తో ఇక్కడి ప్రభుత్వం ఇండస్ట్రీకి మరోసారి దగ్గరయింది. మరి ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాల్లో సడలింపులు ఉంటాయా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News