ఇప్పుడంతా పుష్ప-2 ట్రెండ్ నడుస్తోంది. రేపు అర్ధరాత్రి నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాడు పుష్పరాజ్. ఈ సినిమాకు కొనసాగింపుగా 'పుష్ప 3' ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. అది నిజం చేస్తూ, తాజాగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్ ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పనిచేశారు. ఆయన తన టీమ్తో కలిసి దిగిన ఫొటో వెనుక 'పుష్ప3'ది ర్యాంపేజ్ టైటిల్ ఉంది. పార్ట్ 2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట కూడా 'పుష్ప3'కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ట్రెండ్ అయ్యాయి. 'పార్ట్ 3' ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు. రెండు, మూడేళ్ల తర్వాతే 'పార్ట్ 3'కి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్కు వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి కచ్చితంగా రెండేళ్లు కావాల్సిందే. ఆ తర్వాతే 'పార్ట్ 3'కి సంబంధించిన పనులు మొదలవుతాయి.