రజనీకాంత్ ఆరోగ్యం కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం చేసిందా.. ?

రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని షిర్డీ సాయినాథున్ని ప్రార్థించిన శ్రీదేవి

Update: 2023-08-04 07:18 GMT

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఒకానొక సమయంలో షూటింగ్ లో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, దాని వల్ల ఆయన ఆస్పత్రి పాలయ్యారని మీకు తెలుసా.. అంతే కాదు అతని ఆరోగ్యం మెరుగవ్వాలని రజనీకాంత్‌ స్నేహితురాలు, నటి శ్రీదేవి షిర్డీ సాయిబాబాకు వేడుకుందట. వీటికి తోడు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఏడు రోజుల పాటు ఉపవాసం కూడా పాటించిందట. అప్పట్లో ఆయన అనారోగ్యంపై పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ పైన చెప్పిన ఆసక్తికర విషయాలు మాత్రం రీసెంట్ గా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.

2011లో రానా సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌కి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. సూపర్ స్టార్ పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం సింగపూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పలు మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ సమయంలో రజనీకాంత్ ను చెన్నైలోని ఇసాబెల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను ఆసుపత్రిలో చేరడానికి కారణం అలసట, వాంతులేనని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. సుమారు 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత, రజనీ డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత మే 14న రామచంద్ర మెడికల్ సెంటర్ కు తరలించారు.

నటుడి అన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్ చెప్పిన వివరాల ప్రకారం, రజనీ బరువు తగ్గడానికి కఠినమైన ఆహార నియమాలు పాటించారు. కానీ అది ఆ తర్వాత తీవ్ర సమస్యలకు దారితీసింది. ఈ సమయంలోనే సూపర్ స్టార్ ఆల్కహాల్ కూడా మానేశారు. ఆ తర్వాత విపరీతమైన బరువు తగ్గారు. అయితే రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు మరింత దిగజారడం మొదలుపెట్టాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రజనీకాంత్‌కు సన్నిహితురాలైన శ్రీదేవి అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. షిర్డీ సాయిబాబాకు ప్రార్థనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఏడు రోజులు ఉపవాసం కూడా పాటించింది. దైవిక ఆశీర్వాదం కోసం పూణేలోని సాయిబాబా ఆలయాన్ని కూడా సందర్శించింది. మూండ్రు ముడిచు, జానీ లాంటి సినిమాల్లో రజనీకాంత్ తో కలిసి నటించడంతో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి.

ఈ సమయంలోనే రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రతిరోజూ అనేక నివేదికలు వచ్చాయి, ఇది విస్తృతమైన ఆందోళనలకు దారితీసింది. ఈ ఊహాగానాల మధ్య రజనీకాంత్ మరణించాడనే తప్పుడు పుకార్లు కూడా వ్యాపించాయి. ఇది ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులలో మరింత ఆందోళనను పెంచింది. అయితే, ఈ నిరాధారమైన వాదనలన్నింటినీ కొట్టివేస్తూ, జూలై 13న రజనీకాంత్ తమిళనాడుకు తిరిగి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన స్పష్టం చేసింది.

ఆయన స్వదేశానికి వస్తున్నారనే వార్త తెలియగానే, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు విమానాశ్రయానికి తరలి వచ్చారు. సూపర్ స్టార్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. చివరకు రజనీకాంత్ ఉత్సాహంగా కనిపించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రేక్షకులను అభినందిస్తూ, తనపై అంకితభావంతో ఉన్న అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆయన్ను చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News