అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ పుష్ప 2. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతోదానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పుష్ప ది రూల్ అంటూ వస్తోన్న ఈ మూవీ గురించి కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ప్రధానంగా వాళ్లు టార్గెట్ గా పెట్టుకున్న ఆగస్ట్ 15న విడుదల కాకపోవడంతో ఆ రూమర్స్ మరింత పెరిగాయి. ఇంకా చెబితే ఈ మూవీ ఆగస్ట్ 15 నుంచి పోస్ట్ పోన్ అవుతుందని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. మొదట కాదు అన్నా.. ఫ్యాన్స్ రంగంలోకి దిగిన తర్వాత పోస్ట్ పోన్ మేటర్ అఫీషియల్ గా చెప్పింది నిర్మాణ సంస్థ మై. ఇక కొత్త డేట్ గా డిసెంబర్ 6 న ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ నుంచి కూడా పుష్ప 2 పోస్ట్ పోన్ కాబోతోందా అనే చర్చలు జరుగుతున్నాయి.
పుష్ప 2 షూటింగ్ ఇప్పటి వరకూ అనుకున్నట్టుగా సాగడం లేదు అని టాక్. దీనికి తోడు డిసెంబర్ 6న కొత్త కొత్త సినిమాలు రిలీజ్ డేట్స్ వేసుకుంటున్నాయి. పుష్ప 2 లాంటి పెద్ద సినిమాలు లేనప్పుడే అలాంటి అనౌన్స్ మెంట్స్ వస్తాయి. కావాలంటే ఆగస్ట్ 15న పుష్ప రావడం లేదు అని అఫీషియల్ న్యూస్ రాకముందే.. ఆయ్, డబుల్ ఇస్మార్ట్ మూవీ మేకర్స్ ఆ డేట్ లో వస్తున్నాం అని ప్రకటించారు. మామూలుగా పెద్ద సినిమాలు రావడం లేదు అని ఇన్ డైరెక్ట్ గా అయినా తెలిసినప్పుడే ఇలా జరుగుతుంది. అందుకే పుష్ప 2 డిసెంబర్ లో కూడా రావడం లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఏదేమైనా ఒక్కసారి పోస్ట్ పోన్ అయితే ఆ సినిమాలపై ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మరి అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. అక్కడ ఏమైనా ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ఖచ్చితమైన అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. అన్నట్టు,.. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చిత్రాన్ని సుకుమార్ భార్య బబిత నిర్మించింది.