మూడో టెస్ట్.. రెండు రోజుల్లోనే.. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం..!
పింక్ బాల్ టెస్టులో టీంఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోకుండా చేధించింది.;
పింక్ బాల్ టెస్టులో టీంఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు రోహిత్(25), గిల్ (15) పరుగులతో విజయాన్ని అందించారు. దీనితో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరిస్ లో భారత్ 2-1తో ముందజలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో స్టోక్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే.. రూట్ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికట్లు, అశ్విన్ 4, సుందర్ ఒక వికెట్ తీశాడు.