శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. 3.2 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు..;
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. 3.2 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. దీని విలువ 21 కోట్లు ఉంటుందన్నారు. ఖతర్ ఎయిర్లైన్స్ విమానంలో దోహా మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ స్మగ్లర్ వద్ద హెయిరాన్ గుర్తించారు. నిందితుడు జాంబియా దేశస్థుడని వెల్లడించారు. హైదరాబాద్కు మత్తు పదార్థాల రవాణా జరుగుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో మాటు వేసి నిందితుడిని పట్టుకున్నామన్నారు.