దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో దారుణ ఘటన చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం కోర్టులో హాజరైన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీల మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయికి చేరి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో అమన్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. కోర్టు విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా జితేందర్, అమన్ అనే ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్తా ప్రాణం తీసింది. వీరి మధ్య శత్రుత్వం 2024 నాటిదని తెలుస్తోంది. ఆ సమయంలో ఇద్దరూ బెయిల్ పై బయటకు వచ్చి దాడి కేసులో చిక్కుకున్నారు. ఇద్దరి మధ్య లోతుగా పాతుకుపోయిన శత్రుత్వం కోర్టు ప్రాంగణంలో ఘోరమైన ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. కోర్టు ప్రాంగణం లోనే ఈ ఘటన జరగడంతో అక్కడ హాజరైన పోలీసులు, న్యాయవాదులు, ఇతర సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ దాడి జరిగిన సమయంలో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అమన్ను దాడి చేసిన ఖైదీ పారిపోవడానికి యత్నించగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఖైదీ మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.