Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ పైనుంచి దూకి..
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధి బీఎన్రెడ్డి నగర్లో విషాదం చోటుచేసుకుంది.;
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధి బీఎన్రెడ్డి నగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక వసతిగృహంలో ఉంటున్న బీటెక్ విద్యార్థిని హాస్టల్ మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన రమ్యగా పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు.