SAD: బాలికల పీరియడ్స్‌ చెక్‌ చేసిన స్కూల్ సిబ్బంది

ఆరుగురు స్కూల్ సిబ్బంది సస్పెండ్;

Update: 2025-07-11 03:00 GMT

మహా­రా­ష్ట్ర­లో­ని ఠాణె జి­ల్లా­లో­ని ఓ ప్రై­వే­ట్‌ పా­ఠ­శా­ల­లో వి­ద్యా­ర్థి­నుల పట్ల అమా­న­వీ­యం­గా ప్ర­వ­ర్తిం­చిన సం­ఘ­టన ఆల­స్యం­గా వె­లు­గు­లో­కి వచ్చిం­ది. పా­ఠ­శాల బా­త్రూ­మ్‌­లో నె­ల­స­రి రక్త­పు మర­క­లు కన­ప­డ­డం­తో, వా­టి­కి కా­ర­ణ­మైన వా­రి­ని తె­లు­సు­కు­నేం­దు­కు వి­కృత చే­ష్ట­ల­కు పా­ల్ప­డ్డా­రు.  బా­లి­క­లం­ద­రి­నీ లై­న్‌­లో ని­ల­బె­ట్టి.. వారి వ్య­క్తి­గత అవ­య­వా­ల­ను టచ్‌ చే­స్తూ పీ­రి­య­డ్స్‌­లో ఉన్నా­రో, లేదో చె­క్‌ చే­యిం­చా­రు.  

మం­గ­ళ­వా­రం జరి­గిన ఈ సం­ఘ­ట­న­లో, 5వ తర­గ­తి నుం­చి 10వ తర­గ­తి వరకు చదు­వు­తు­న్న బా­లి­క­లం­ద­రి­నీ స్కూ­ల్ కన్వె­న్ష­న్ హా­ల్‌­కు పి­లి­పిం­చి, బా­త్రూ­మ్‌­లో తీ­సిన ఫో­టో­లు చూ­పి­స్తూ, పీ­రి­య­డ్స్‌­లో ఉన్న­వా­రూ, లే­ని­వా­రూ వే­రు­వే­రు­గా ని­ల­బ­డా­ల­ని స్కూ­ల్ ప్రి­న్సి­ప­ల్ ఆదే­శిం­చా­రు. తనతో అబ­ద్దం చె­బు­తు­న్నా­ర­ని భా­విం­చిన ప్రి­న్సి­ప­ల్, మహి­ళా అటెం­డెం­ట్‌­ను పి­లి­పిం­చి, పీ­రి­య­డ్స్‌­లో లే­మ­ని చె­ప్పిన బా­లి­క­ల్ని చెక్ చే­యిం­చా­ర­ని బా­ధి­తుల తల్లి­దం­డ్రు­లు తె­లి­పా­రు.  ఆ అటెం­డెం­ట్ బా­లి­క­ల­ను వా­ష్‌­రూ­మ్‌­లో­కి తీ­సు­కె­ళ్లి వారి వ్య­క్తి­గత అవ­య­వా­ల­ను తా­కు­తూ పరి­శీ­లిం­చ­డం­తో, వి­ద్యా­ర్థి­ను­లు మా­న­సి­కం­గా తీ­వ్ర ఆవే­ద­న­కు గు­రై­య్యా­రు. ఇం­టి­కె­ళ్లిన తర్వాత తల్లి­దం­డ్రు­ల­కు వి­ష­యం చె­ప్ప­డం­తో వారు స్కూ­ల్ ముం­దు ని­ర­స­న­కు ది­గా­రు. ఫి­ర్యా­దు మే­ర­కు పో­లీ­సు­లు ప్రి­న్సి­ప­ల్‌, ప్యూ­న్‌, నలు­గు­రు టీ­చ­ర్లు, ఇద్ద­రు ట్ర­స్టీ­లు­పై కేసు నమో­దు చే­శా­రు. ఇప్ప­టి­వ­ర­కు ఇద్ద­రి­ని అరె­స్ట్‌ చే­సి­న­ట్లు తె­లి­పా­రు. "ఇది పి­ల్లల గౌ­ర­వా­న్ని, హక్కు­ల­ను అవ­మా­నిం­చ­డ­మే. ఇలా చెక్ చే­య­డం హిం­స­కం­టే తక్కువ కాదు" అని తల్లి­దం­డ్రు­లు ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. వి­ద్యా సం­స్థ­ల్లో ఇటు­వం­టి చర్య­లు తీ­వ్రం­గా ఖం­డిం­చా­ల్సి­న­వ­ని, బా­ధ్యు­ల­పై కఠిన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని పౌ­ర­సం­ఘా­లు డి­మాం­డ్ చే­స్తు­న్నా­యి. ఈ విధంగా పిల్లలకు గుప్త పరీక్షలు నిర్వహించడంపై తల్లిదండ్రులు , సామాజిక వేత్తలు నిరసన తెలిపారు. యుక్తవయస్సు పిల్లలను ఎంచుకుని ఈ విధంగా శల్యపరీక్షకు దిగారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. తమ పిల్లలను బట్టలు తీయించి మరీ పరీక్షించారని , ఇది దారుణం అని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. రుతుక్రమం గురించి ఈ ఈడు పిల్లలకు సరైన అవగావహన కల్పించాల్సింది. పోయి ఈ విధంగా అమానుషంగా వ్యవహరించడం తమకు బాధాకర విషయం అయిందని బాలిక తల్లి ఒక్కరు వాపోయారు. ఈ స్కూల్ ప్రిన్సిపాల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.

Tags:    

Similar News