వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు పలు సూచనలు చేశారు. 1. టైర్లలో ఎయిర్ ప్రెషర్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే వేడికి టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. 2. ఇంజిన్ కూలెంట్ స్థాయిని చెక్ చేయండి. అవసరమైతే రీఫిల్ చేయండి. 3. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయండి. 4. ఏసీ వ్యవస్థ పనిచేస్తుందో లేదో చూడండి.
వేసవిలో వాహనాల టైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టైర్లు నాణ్యంగా ఉండకపోతే ఎండవేడిమికి టైర్లు పగిలిపోయి అవకాశాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో తరచూ దూర ప్రాంతాలకు వెళ్తుంటాం. వాహనాల టైర్ల నాణ్యత సరిగా లేకపోతే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే..ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.