మిస్ వరల్డ్ - 2025 పోటీల్లో కీలకఘట్టానికి చేరుకున్నాయి. మరో మూడు రోజుల్లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచ సుందరి కిరీటం కోసం అందాల భామలు ఎదురు చూస్తున్నారు. ఆ కిరీటం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. 108 దేశాలనుంచి సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. దశలవారీగా వడపోత జరుగుతోంది. ఈనెల 31న ప్రపంచ సుందరి పోటీల్లో ఫైనల్స్ జరుగుతాయి. ఆ రోజు పోటీలో ఖండానికి ఒకరు చొప్పున ఎంపిక చేసిన సుందరీమణులు పాల్గొం టారు. వీరిలోనే ఒకరిని ప్రపంచ సుందరిగా ఎంపిక చేస్తారు. కాగా మిస్ వరల్డ్ విజేతకు అందే నజరానాపై ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రపంచ సుందరికి ఏకంగా లక్ష మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. మన కరెన్సీలో చెప్పా లంటే దాదాపు రూ.8.5 కోట్ల మేర నగదు బహుమతి ఉంటుంది.