బాలీవుడ్ నటుడు డినో మోరియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి వచ్చేవారం ఈడీ విచారణకు రావాలని డినో మోరియాకు సమన్లు పంపింది. రూ.65 కోట్ల విలువైన మిథి నది పూడికతీత పనుల కేసులో ఈడీ ఈ సమన్లు పంపినట్లుగా సమాచారం. ఈ కేసులో కేంద్ర ఏజెన్సీ నటుడికి సమన్లు పంపడం ఇదే మొదటిసారి. నటుడికి ఈడీ అధికారికంగా సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ కుంభకోణానికి సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఇప్పటికే రెండుసార్లు ఆయనను ప్రశ్నించింది