Check Cyber Frauds : సైబర్ మోసాలకు చెక్ పెడదాం.. జియో, వీఐకి ప్రతిపాదించిన ఎయిర్టెల్

Update: 2025-05-26 06:00 GMT

రోజు రోజుకూ పెరిగిపోతున్నటెలికం మోసాల కు వ్యతిరేకంగా కలిసి పని చేద్దామని భారతీ ఎయిర్టెల్.. రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(వీఐ)కి ప్రతిపాదించింది. ఈ విషయాన్ని టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ కు తెలిపింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హానికరమైన మోసాల విషయంలో పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి టెల్కో లు అందరూ సహకరించాలని, ఈ సమస్యను సమిష్టింగా పరిష్కరించాలని కూడా ఎయిర్టెల్ కోరింది. దీనిపై అన్ని టెలికం సంస్థలకు ఎయిర్టెల్ వేరువేరుగా లేఖలు రాసింది. 2024లో మొదటి 9 నెలల కాలంలోనే 17 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. సైబర్ మోసాల్లో 11,000 కోట్లు నష్టం జరిగిందని పేర్కొంది.

సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ లింక్లు, నకిలీ లోన్ ఆఫర్లు, మోసపూరిత చెల్లింపుల లింక్లు వంటి అధునాత వ్యూహాలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న డిజిటల్ మోసాలను ఎదుర్కొవాల్సిన అవసరం ఉందని తెలి పింది. డిజిటల్ స్పామ్ లు, స్కామ్స్ పై యుద్ధాన్ని ఎయిర్టెల్ ముమ్మరం చేసింది. గత కొన్ని వారాలుగా సునీల్ మిట్టల్ నేతృ త్వంలోని టెక్కో కమ్యూనికేషన్ ఓటీటీ యాప్ లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇతర ప్లాట్ఫామ్ లలో మోసపూరిత సైట్లను బ్లాక్ చేయడానికి, మోసాలను గుర్తించి పరిష్కారాన్ని రూపొందిస్తోంది. ఇటీవల కాలంలో పెద్దగా అనుమానంలేని వ్యక్తుల నుంచి జరుగుతున్న ఫిషింగ్ ప్రయత్నాలు, హానికరమైన యూఆర్ఎల్ ఆధారిత స్కామ్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, వీటిని సమన్వయంతో పరిశ్రమ ఎదుర్కో వాల్సిన అవసరం ఉందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News