కష్టాలు, కన్నీళ్లు అధిగమించి క్యాన్సర్ ను జయించిన ప్రపంచ సుందరి, థాయ్ భామ ఓపల్ సుచాత సేవకే ప్రయారిటీ ఇచ్చింది. 16 ఏళ్ళ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినప్పటికీ బెదరని ధీరవనిత ఓపల్ సుచాత. కేన్సర్ ను జయించడంతో పాటుగా ఓపల్ హర్ సంస్థనుస్థాపించి ఉచిత స్క్రీనింగ్ ఫెసిలిటీ, మెరుగైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందిస్తోంది. 2025 మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండు ప్రాతినిధ్యం వహించే హక్కును సంపాదించడానికి చాలా కష్టాలు పడింది. 2024లో థాయి లాండ్ కు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తిరిగి తీసుకురావడానికి ఆమె బలమైన పోటీ దారుగా నిలిచింది.
మెక్సికోలో జరిగిన పోటీ ముగింపులో మూడవ రన్నర్ నిలిచింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకురాలు నవత్ ఇత్సారగ్రిసిల్ ఈ సంవత్సరం ప్రారంభంలో మిస్ యూనివర్స్ పోటీకి థాయ్ జాతీయ ఫ్రాంచైజీని పొందిన తర్వాత ఆమె జాతీయ సంస్థ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్తో విభేదిం చింది. మాజీ మిస్ యూనివర్స్ థాయిలాండ్ నిర్వాహకురాలు ఆ తర్వాత థాయ్ మిస్ వరల్డ్ లైసెన్స్రుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తరువాత 72వ మిస్ వరల్డ్ పోటీలో పోటీ పడటానికిఅర్హత సాధించింది. 16 సంవత్సరాల వయస్సులో ఓపల్ సుచాత రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో సర్జరీ ద్వారా రొమ్ముకు చికిత్సచేయించుకున్నారు. ఆ సమయంలో జీవితంలో తన కలలను నిజం చేసుకుంటానో లేదోనని భయపడిందట. కానీ ఆమె మనోధైర్యం ఆమెను మళ్లీ నిలబెట్టింది. ఆ తర్వాత ఓపల్ రొమ్ము క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. అవగాహన కలిగించడమే కాదు.. క్యాన్సర్ బాధితుల కోసం నిధులను సేకరించాలని నిశ్చయించుకుంది. క్యాన్సర్తో బాధపడుతున్నవారు, జయించిన వారు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులతో సంస్థను స్థాపించారు.