Elon Musk : ఎక్స్ మనీ! యూపీఐ పేమెంట్స్ కి మస్క్ ఎంట్రీ

Update: 2025-05-29 09:15 GMT

టెస్లా అధినేత యూపీఐ పేమెంట్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ లోకి మస్క్ కు చెందిన ఎక్స్ ప్లాట్ ఫామ్ అడుగు పెట్టనుంది. ఎక్స్ మీ అనే కొత్త ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ సీఈవో లిండా యాకారినే వెల్లడించారు. ఈ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు గురించి పెద్ద ప్రకటన ఇస్తామని ఆమె చెప్పారు. ఎక్స్ -వీసా భాగస్వామ్యం తో ఎక్స్ వాలెట్ సర్వీసు అందుబాటులోకి తీసుకొస్తామని బుధవారం తమ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టుచేశారు. వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు చేసుకునే ఆప్షన్ తీసుకొస్తున్నట్లు వివరించారు. దీంతో బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు లింక్ చేసుకుని ఎక్స్ మనీ వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. గతంలో కూడా ఎలాన్ మస్క్ ఎక్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి ప్ర స్తావించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News