Asad Encounter: స్పెషల్ టాస్క్ ఫోర్స్ పై ఆదిత్యానంద్ ప్రసంశలు వెల్లువ

Update: 2023-04-13 10:04 GMT

ఉమేశ్ పాల్ హత్య కేసులో కీలక నిందితుడైన అసద్ ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్ లో హతమార్చిన సంగతి తెలిసిందే. అతడితో పాటూ పోలీసులు గాలిస్తున్న మరో నిందితుడు గులామ్ సైతం ఈ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఇదే విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎంస్ యోగీ ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ గురించిన సమాచారం అందుకున్న సీఎం హుటాహుటిన అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్కౌంటర్ లో పాలుపంచుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులను ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమతుల్యానికి వారు చేస్తున్న కృషిని కొనియాడారు. 

Tags:    

Similar News