Mumbai: గాయపడ్డ పక్షిని రక్షిద్దామనుకున్నారు.. అంతలోనే వారి ప్రాణాలు..
Mumbai: మృత్యువు నీడలా వెన్నంటే ఉంటుంది అంటారు అందుకేనేమో.. గాయపడ్డ పక్షిని రక్షిద్దామని కారు దిగారు..
Mumbai: మృత్యువు నీడలా వెన్నంటే ఉంటుంది అంటారు అందుకేనేమో.. గాయపడ్డ పక్షిని రక్షిద్దామని కారు దిగారు.. వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొని ప్రాణాలు కోల్పోయారు బాంద్రాకు చెందిన ఇద్దరు వ్యక్తులు.
మే 30 మధ్యాహ్నం నేపీన్సీ రోడ్లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా మలాడ్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు.
బాంద్రా-వర్లీ సీ లింక్లో గాయపడిన పక్షిని రక్షించేందుకు కారులో నుంచి దిగిన 43 ఏళ్ల వ్యాపారవేత్త మరియు అతని డ్రైవర్ మే 30న టాక్సీ ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "బాంద్రా వర్లీ సీ లింక్లో మార్గమధ్యంలో, ఒక పక్షి వారి కారును ఢీకొట్టింది, దాని తర్వాత గాయపడిన పక్షిని రక్షించడానికి జరీవాలా దిగాడు.
వెనుక నుంచి వేగంగా వచ్చిన టాక్సీ జరీవాలా, అతని డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్ను ఢీకొట్టింది. జరీవాలా ఎగిరి అంత దూరంలో పడ్డారు.. ఆయన అక్కడికక్కడ మరణించగా, డ్రైవర్ కామత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ట్యాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ జైశ్వర్ (30) ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
What a tragedy. This is Mumbai's Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY
— Singh Varun (@singhvarun) June 10, 2022