ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదం..

యూపీలోని ఘజియాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మురాద్ నగర్ లో వర్షం కారణంగా స్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్ లోని పైకప్పు కూలింది.

Update: 2021-01-03 11:15 GMT

యూపీలోని ఘజియాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మురాద్ నగర్ లో వర్షం కారణంగా స్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్ లోని పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. 

Tags:    

Similar News