తెలంగాణలో కరోనా కొత్త కేసులు..

దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 1,79,246కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Update: 2020-09-24 04:00 GMT

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 55,318 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 2,176 మంది పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 1,79,246కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక కరోనాతో నిన్న 8 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పటి వరకు మృతి చెందిన కరోనా కేసుల సంఖ్య 1,070. కరోనా బారినపడి కోలుకున్న వారు 2,004. కాగా కోలుకున్న బాధితుల సంఖ్య 1,48,139గా నమోదైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 30,037 మంది ఉంటే వీరిలో ఐసోలేషన్‌లో ఉన్న వారు 23,929 అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 26,84,215కి చేరుకుంది. 

Tags:    

Similar News