కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఇలాంటి వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని మన శరీరంలో పెంచే అద్భుతమైన హెల్త్ సప్లిమెంట్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తోంది. హైదరాబాద్కు చెందిన క్లోన్డీల్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ సంజీవనిని ఆవిష్కృతం అయ్యింది. హైదరాబాద్ CCMBలో సుదీర్ఘకాలం పరిశోధనల ఫలితమే ఈ 'కరోనెయిడ్'. ఓరల్ సస్పెన్షన్ రూపంలో ఈ కరోనెయిడ్ను పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా తీసుకోవచ్చు. ఇది యాంటీ వైరల్, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. యాంటీ ఆక్సిడెంట్గా రోగ నిరోధకశక్తిని పెంచే ఈ కరోనెయిడ్ ఇప్పుడు మార్కెట్లోకి రావడం సంచలనం అనే చెప్పాలి. కోవిడ్-19 మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే మనలో రోగనిధోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయాలి. ఇమ్యూనిటీ పెరగాలి. ఇందుకు దోహదపడేలాగే నోటిద్వారా తీసుకునే ఈ హెల్త్ సప్లిమెంట్ కరోనెయిడ్ మార్కెట్లోకి వచ్చింది.