Coronavirus India : కొత్తగా 10,549 కొత్త కేసులు, 488 మరణాలు..!

Coronavirus India : భారత్ లో మరోసారి పదివేలకి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,549 కరోనా కేసులు నమోదయ్యాయి.

Update: 2021-11-27 02:46 GMT

Coronavirus India : భారత్ లో మరోసారి పదివేలకి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,549 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,45,55,431కి చేరుకుంది. ఇక కొత్తగా 488 మరణాలు సంభవించాయి. ఇందులో ఎక్కువ మరణాలు కేరళలోనే సంభవించాయి. దీనితో మరణాల సంఖ్య 4,67,468కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటి వరకు 120 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌ లను అందజేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News