Pranshuk Kanthed Jain Muni : కోట్ల రూపాయల ఉద్యోగాన్ని వదులుకుని.. సన్యాసి జీవితం గడపాలని..
Pranshuk Kanthed Jain Muni : మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాకు చెందిన ప్రన్శుక్ కాంతేడ్ డిసెంబర్ 26న ఆచార్య ఉమేష్ మునీజీ మహారాజ్ శిష్యుడు జినేంద్ర మునీజీ నుండి జైన సన్యాసిగా మారేందుకు దీక్ష తీసుకోనున్నారు.;
Pranshuk Kanthed Jain Muni : మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాకు చెందిన ప్రన్శుక్ కాంతేడ్ డిసెంబర్ 26న ఆచార్య ఉమేష్ మునీజీ మహారాజ్ శిష్యుడు జినేంద్ర మునీజీ నుండి జైన సన్యాసిగా మారేందుకు దీక్ష తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ భారీ జీతం మరియు పెద్ద పదవిని ఆశిస్తారు. దీనికోసం యువతీ యువకులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రన్శుక్ కూడా ఆ విధంగానే కష్టపడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు.
అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అయినా ఎందుకో అతడికి సంతృప్తిగా అనిపించలేదు. ఇదికాదు జీవితం అంటే అనుకున్నాడు. సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. డేటా సైంటిస్ట్గా పని చేస్తున్న అతడి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రూ.1.25 కోట్ల ఉద్యోగాన్ని విడిచిపెట్టి జైన ముని అయ్యాడు. అతని నిర్ణయం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జైన సన్యాసిగా మారేందుకు దీక్ష చేస్తా
ప్రన్శుక్ 2016 నుండి జనవరి 2021 వరకు USలో నివసించారు. అతను దాదాపు 3 సంవత్సరాలు డేటా సైంటిస్ట్గా పనిచేశాడు.
ప్రన్శుక్ చిన్నతనం నుంచి సాధువు కావాలనుకున్నాడు. తన మనసులో బలంగా నాటుకుపోయిన ఆ కోరికతో ఇప్పుడు జైన సన్యాసిగా దీక్ష చేపట్టబోతున్నాడు. హత్పిపాల్లో 3 రోజుల దీక్షా ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 53 మంది జైన సన్యాసులు రానున్నారు. డిసెంబర్ 26న ఆయన సమక్షంలో దీక్షభూమి ఉత్సవం జరగనుంది.
జైన సన్యాసిగా మారడానికి కారణం ఏమిటి?
అతడు ఈ ప్రపంచంలోని ఆనందాన్ని చూసినప్పుడు, అది క్షణికమైనదిగా భావించాడు. ఆనందం వల్ల మన కోరికలు పెరుగుతాయని చెప్పారు. నేను శాశ్వతమైన ఆనందం కోసం జైన సన్యాసిని కాబోతున్నాను అని సంతోషంతో వివరించాడు.