Delhi-Mumbai Expressway: ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే స్ట్రెచ్.. 3.5 గంటల్లో ఢిల్లీ నుండి జైపూర్కు
Delhi-Mumbai Expressway: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.;
Delhi-Mumbai Expressway: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేలోని 246 కి.మీ ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ను రూ.12,150 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు.
ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేలో పూర్తి చేసిన మొదటి విభాగమైన ఢిల్లీ - దౌసా - లాల్సోట్ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే మార్గం ద్వారా ఢిల్లీ నుండి జైపూర్కు ప్రయాణ సమయం 5 గంటల నుండి సుమారు 3.5 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రణాళిక ఆర్థిక అభివృద్ధికి పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
ఈ ఎక్స్ప్రెస్వే ఢిల్లీ-ముంబైలను కలుపుతుంది. ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటలకు తగ్గిస్తుంది.
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే యొక్క 1వ స్ట్రెచ్ గురించి తెలుసుకోవలసిన ఐదు విషయాలు..
-ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేలోని 246 కి.మీ ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ను రూ.12,150 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు.
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి జనం మద్దతు కూడగట్టుకునేందుకు చేసే ప్రయత్నంలో ఇది ఒక అంశంగా పేర్కొంటున్నాయి ప్రతిపక్షాలు.
ఇది ఎనిమిది లేన్లను కలిగి ఉంటుంది.
-ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే 1,386 కి.మీ పొడవుతో భారతదేశపు అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే. ఇది ఢిల్లీ మరియు ముంబై మధ్య ప్రయాణ దూరాన్ని 1,424 కిమీ నుండి 1,242 కిమీకి తగ్గిస్తుంది. ప్రయాణ సమయం 24 గంటల నుండి 12 గంటలకు తగ్గుతుంది.
-ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే ఆరు రాష్ట్రాల గుండా వెళుతుంది: ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర మరియు సూరత్ వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది.
ఎక్స్ప్రెస్వే 93 PM గతి శక్తి ఎకనామిక్ నోడ్స్, 13 పోర్ట్లు, 8 మేజర్ ఎయిర్పోర్ట్లు మరియు 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు (MMLPs)తో పాటు కొత్తగా రాబోయే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలైన జేవార్ ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఎయిర్పోర్ట్ మరియు JNPT పోర్ట్లకు కూడా సేవలు అందిస్తుంది.
ఎక్స్ప్రెస్వే అన్ని పరిసర ప్రాంతాల అభివృద్ధి పథంపై ఉత్ప్రేరక ప్రభావాన్ని చూపుతుంది, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది.
-ఇది భారతదేశం మరియు ఆసియాలో జంతు ఓవర్పాస్లు, అండర్పాస్లను ఏర్పాటు చేసిన మొదటి ఎక్స్ప్రెస్ వే.
-ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో రూ. 25,000 లక్షల టన్నుల బిటుమెన్ వినియోగించారు. 4,000 మందికి పైగా శిక్షణ పొందిన సివిల్ ఇంజనీర్లు ఉపాధి పొందుతారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వీటితో సహా, 24 గంటల్లో అత్యధిక పరిమాణంలో PQC వేయడంతో పాటు, 100 గంటల్లో అత్యధిక పరిమాణంలో దట్టమైన తారు వేయబడినందుకు రెండు ప్రపంచ రికార్డులను కూడా సృష్టించింది.