ఎన్నికల ప్రచారంలో దూకుడుమీదున్న దీదీకి షాక్

హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఇటీవలే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-04-08 09:00 GMT

ఎన్నికల ప్రచారంలో దూకుడుమీదున్న దీదీకి షాక్ తగిలింది. ఓట్లు చీలిపోనివ్వొద్దని, వేరే పార్టీలకు ఓటేయొద్దని, తమ పార్టీకే ఓటేయాలని ఆమె మైనార్టీలను విజ్ఞప్తి చేయడంపై దుమారం రేగింది. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఇటీవలే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మమత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఈసీ... మత ప్రాతిపాదికన ఓట్లు అడగడంపై 48 గంటల్లో సమాధానం చెప్పాలని మమతకు నోటీలు ఇచ్చింది. 

Tags:    

Similar News