దేశంలో మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చాం : నిర్మలా సీతారామన్‌

దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్‌.

Update: 2021-02-01 11:45 GMT

దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్‌. మౌలిక వసుతుల్లో రోడ్లు, విద్యుత్ ఉత్పత్తి, బ్రిడ్జిలు, పోర్టుల నిర్మాణానికి పెద్దపీటవేశామన్నారు. వాటితోపాటు ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా సమయంలో గత ఏడాది దేశంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో వాటిని అధిగమించేలా బడ్జెట్‌ రూపొందించామన్నారు ఆర్థిక మంత్రి. యువతకు ఉపాధి అవకాశాలతోపాటు.. మానవ వనరుల వినియోగం, రవాణా వంటి కీలక రంగాలపైనా దృష్టిపెట్టామన్నారు నిర్మలా సీతారామన్‌.

Tags:    

Similar News