పరుగులు పెడుతున్న పసిడి.. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములు..
తాజాగా హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర భారీగా;
మార్కెట్లో మరే వస్తువుల ధరలు ఇంతగా హెచ్చుతగ్గులు చూపించవేమో.. బంగారంకు ఉన్న డిమాండ్ అలాంటిది. అలంకరణకు ఆభరణంగానే కాకుండే.. అవసరమైనప్పుడు ఆదుకునేందుకు కూడా ఆ వస్తువు ఉపయోగపడుతుంది. అందుకే బంగారం మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ వేస్ట్ కాదు అని అంటారు పెద్దలు.. వారం రోజుల తేడాతో ధరల విషయంలో ఎన్నో హెచ్చు తగ్గులు కనబడుతుంటాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరిగి రూ.53,240కు చేరింది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.390లకు పైగా పెరిగి రూ.48,810కు చేరింది. ఇక పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కేజీ వెండి ధర రూ.1500 పెరిగి రూ. 62,900కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. ఔన్స్ బంగారం ధర 0.21 శాతం పెరుగుదలతో 1930 డాలర్లకు చేరింది. వెండి ధర కూడా అలానే పెరుగుతోంది. వెండి ధర ఔన్స్కు 1.28 శాతం పెరుగుదలతో 25.43 డాలర్లకు చేరింది. పలు అంశాలు బంగారం పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి.