భారీ వర్షాలు.. 17 మంది మృతి

భారీ వర్షాలు ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వానలు పడుతున్నాయి.

Update: 2020-08-30 15:28 GMT

భారీ వర్షాలు ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పిడింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంభవించిన వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర సర్కార్ ఆదివారం తెలిపింది. సుమారు 10,382 ఇళ్ళు దెబ్బతిన్నట్లు పేర్కొంది. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. 

Tags:    

Similar News