కరోనా టీకా పంపిణీలో మరో రికార్డ్‌ సాధించిన భారత్‌ ..!

కరోనా టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని అధిగ‌మించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Update: 2021-04-19 06:30 GMT

కరోనా టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని అధిగ‌మించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 12 కోట్ల టీకా డోసుల ల‌క్ష్యం చేరుకోవ‌డాఇకి యూఎస్‌లో 97 రోజులు పట్టగా చైనాలో 108 రోజుల సమయం పట్టింద‌ని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్ 92 రోజుల్లో 12 కోట్ల డోసులు పూర్తి చేసుకుంది.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 12 కోట్లకు పైగా టీకాలు ఇచ్చామని కేంద్రం తెలిపింది అందులో ఆరోగ్య సిబ్బందిలో 91 లక్షల మందికి పైగా తొలి డోసు టీకా తీసుకోగా.... 57 లక్షల మంది రెండో డోసు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59 శాతంగా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గుజరాత్‌లో కోటీ, మహారాష్ట్రలో కోటీ 21 లక్షలు, యూపీలో కోటీ 7 వేలు డోసులు పంపిణీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 26 లక్షల డోసులు పంపిణీ చేశారు.

Tags:    

Similar News