నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటా : రాహుల్‌ గాంధీ

Update: 2020-11-19 05:35 GMT

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. రాహుల్‌ తో పాటు పలువురు సీనియర్‌ నేతలు ఉన్నారు. అధికారానికి ప్రతిరూపమైన ఆమె.. సమర్థవంతమైన ప్రధానమంత్రి అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఆమె నాయకత్వ పటిమ గురించి దేశం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతుందన్నారు. నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని.. ఆమె నేర్పించిన విషయాలు తనను ప్రేరేపిస్తాయని ట్వీట్‌ చేశారు రాహుల్‌ గాంధీ.

Tags:    

Similar News