Tamil Nadu Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌సింగ్‌ మృతి..

Tamil Nadu Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వరుణ్‌సింగ్‌ చనిపోయారు.

Update: 2021-12-15 07:42 GMT

Varun Singh (tv5news.in)

Tamil Nadu Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌సింగ్‌ చనిపోయారు. జనరల్‌ రావత్‌ సహా 14మంది ఆర్మీ సిబ్బంది వెల్లింగ్టన్ బేస్‌ క్యాంప్‌కు వెళ్తుండగా.. కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే 13 మంది చనిపోయారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ ఒక్కరే తీవ్రంగా కాలిన గాయాలతో బయటపడ్డారు.

వెంటనే మిలటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ వరుణ్‌సింగ్‌ను కాపాడలేకపోయారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ మృతిపై ప్రధాని మోదీ, భారత వైమానికదళం సంతాపం తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్‌సింగ్‌ చనిపోయారు.

జనరల్‌ రావత్‌ సహా 14మంది ఆర్మీ సిబ్బంది వెల్లింగ్టన్ బేస్‌ క్యాంప్‌కు వెళ్తుండగా.. కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే 13 మంది చనిపోయారు.

కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ ఒక్కరే తీవ్రంగా కాలిన గాయాలతో బయటపడ్డారు. వెంటనే మిలటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ వరుణ్‌సింగ్‌ను కాపాడలేకపోయారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ మృతిపై ప్రధాని మోదీ, భారత వైమానికదళం సంతాపం తెలిపారు.


Tags:    

Similar News