Karnataka Lockdown: కర్ణాటకలో మరోసారి పొడిగింపు

Karnataka Lockdown : రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్‌డౌన్‌ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కర్ణాటక సర్కార్...

Update: 2021-06-03 13:45 GMT

Karnataka Lockdown : రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్‌డౌన్‌ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కర్ణాటక సర్కార్... ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ప్రస్తుతం కొనసాతున్న లాక్‌డౌన్‌ ఆంక్షలు ఈ నెల 14 ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. బుధవారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం లాక్‌డౌన్‌ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా కర్ణాటకలో నిన్న ఒక్కరోజే 16,387 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీనితో అక్కడ కేసుల సంఖ్య 26,35,122కి చేరుకుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 30,017మంది మరణించారు.

Tags:    

Similar News