బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.

Update: 2021-03-22 14:24 GMT

బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. లోక్‌సభలో ఈ బిల్లు పాసైంది. గత వారమే రాజ్యసభలో బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీంతో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపునకు మార్గం సుగమమైంది. బీమా రంగంలో ప్రస్తుతం 46 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచుతూ కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.

Tags:    

Similar News