లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా

కోవిడ్ సెంటర్ లో ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Update: 2021-03-21 12:30 GMT

పార్లమెంట్లోనూ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓంబిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఈ నెల 19న కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయన నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ సెంటర్ లో ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.


Tags:    

Similar News