లోక్సభలో ఆసక్తికర సన్నివేశం..!
పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజు కూడా ప్రధానమంత్రి మోదీ సభకు రాకుంటే ఎలా అంటూ.. కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూ ఆవేశంగా ప్రసంగించారు.
లోక్సభలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజు కూడా ప్రధానమంత్రి మోదీ సభకు రాకుంటే ఎలా అంటూ.. కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూ ఆవేశంగా ప్రసంగించారు. పెరిగిన పెట్రోల్ ధరలు, పేదల సమస్యలపై ప్రధానిని కలవాలంటే ఎక్కడికెళ్లాలి..? బెంగాల్లో ప్రచారం ర్యాలీకి వెళ్లాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దీనికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. మోదీ సభకు చాలా సార్లు వచ్చారంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ప్రధానమంత్రి మోదీ సభలోకి ఎంటరయ్యారు. దీంతో బీజేపీ సభ్యులు ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.