మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, ఆయన తనయుడు సింగర్ కాలభైరవ రెండోసారి ప్లాస్మా దానం చేశారు.

Update: 2020-09-21 08:42 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, ఆయన తనయుడు సింగర్ కాలభైరవ రెండోసారి ప్లాస్మా దానం చేశారు. కొన్ని రోజుల క్రితం ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణీతో పాటు కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. కొన్ని రోజుల అనంతరం వారంతా కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కీరవాణీ ఆయన తనయుడు ప్లాస్మాదానం చేశారు. అయితే, ఇప్పుడు మరోసారి కూడా ప్లాస్మా దానం చేసి.. యాంటీబాడీస్ చెక్ చేసుకొని అవకాశం ఉంటే మరోసారి ప్రతీఒక్కరూ దానం చేయాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Tags:    

Similar News