Rahul Gandhi : పెగాసస్ అనేది దేశం మీద జరిగిన ఓ దాడి..!
Rahul Gandhi : పెగాసస్ అనేది దేశం మీద జరిగిన ఓ దాడి అని అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. గత పార్లమెంట్ సెషన్లోనే దీనిపై తాము సర్కారును మూడు ప్రశ్నలు అడిగామని.. కానీ సర్కారు దానికి సమాధానం ఇవ్వలేదన్నారు.
పెగాసస్ అనేది దేశం మీద జరిగిన ఓ దాడి అని అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. గత పార్లమెంట్ సెషన్లోనే దీనిపై తాము సర్కారును మూడు ప్రశ్నలు అడిగామని.. కానీ సర్కారు దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. పెగాసస్ను ఎవరు కొన్నారు... వాటిని ఎవరెవరిపై ఉపయోగించారు.. దానికి సంబంధించిన డేటా భారత్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా అందుబాటులో ఉందా అని ప్రశ్నించామని... కేంద్రం మాత్రం సమాధానం దాటవేసిందని రాహుల్ విమర్శించారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో నిజాలు వెల్లడవుతాయని నమ్ముతునని అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, మాజీ ఐపీఎస్ అధికారి అలోక్ జోషి, డాక్టర్ సందీప్ ఒబెరాయ్ పర్యవేక్షిస్తారు