PM Kisan Yojana : బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు..!
PM Kisan Yojana : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ 11వ విడతలో భాగంగా 20 వేల కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు ప్రధాని మోదీ.;
PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ 11వ విడతలో భాగంగా 20 వేల కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు ప్రధాని మోదీ. 10 కోట్ల మందికి డబ్బులు అందనున్నాయి. హిమాచల్ప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. పీఎం కిసాన్ అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 2018 డిసెంబర్ నెలలో మోదీ సర్కార్ ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ప్రతి ఏటా రైతులకు 6 వేలు అందిస్తోంది. ఇవి ఒకేసారి కాకుండా మూడు ఇన్స్టాల్మెంట్ల రూపంలో రైతులకు అందుతున్నాయి.