మోదీని కూడా రాముడిగా పూజించే రోజు వస్తుంది : తీరథ్ రావత్

రాబోయే రోజుల్లో ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని రాముడితో సమానంగా చూస్తారని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్ రావత్ అన్నారు.

Update: 2021-03-16 05:15 GMT

రాబోయే రోజుల్లో ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని రాముడితో సమానంగా చూస్తారని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్ రావత్ అన్నారు. ఎన్నో దేశాల నేతలు మోదీతో ఫోటో దిగేందుకు తహతహలాడుతున్నారని అన్నారు. మన నేతకు ఇంతటి గౌరవం దక్కడం.. తానూ ఇంతవరకు చూడలేదని అన్నారు. ప్రజలకి మంచి పనులు చేసిన రాముడిని ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారని, మోదీ కూడా ప్రజల కోసం ఎంతో చేస్తున్నారని.. త్వరలో మోదీని కూడా రాముడిగా పూజించే రోజు వస్తుందని అన్నారు. సోమవారం ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. కాగా సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడంతో ఉత్తరాఖండ్ 10వ ముఖ్యమంత్రిగా తీరథ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. 

Tags:    

Similar News