Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి: ప్రధాని మోదీ

Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు దేశ ప్రధాని మోదీ. వరల్డ్ యోగా డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Update: 2021-06-21 08:30 GMT
Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు దేశ ప్రధాని మోదీ. వరల్డ్ యోగా డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా కల్లోలంలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని అన్నారు. కరోనా బారిన పడిన పేషెంట్లకు ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రాణాయామాన్ని నేర్పించారని చెప్పుకొచ్చారు మోదీ. యోగా వల్ల శ్వాసకోస ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. అలాగే- తిరువళ్లువర్ సూక్తులను మోడీ ప్రస్తావించారు. ఎలాంటి రోగాన్నైనా నయం చేయడానికి దాని మూలాలకు వెళ్లాల్సి ఉంటుందని తిరువళ్లువర్ చెప్పారని మోడీ గుర్తు చేశారు. యోగా అలాంటి సాధనమేనని అన్నారు. పలు దేశాలు యోగాపై ప్రయోగాలు కూడా చేస్తున్నాయన్నారు మోదీ.

Tags:    

Similar News